Chiranjeevi Be The Real Manతెలుగు సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీలలో ప్రస్తుతానికి #BeTheREALMAN ఛాలెంజ్ హవా నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా గత కొన్నిరోజులగా ఇంటికే పరిమితమైన పురుషులు తమ కోసం, తమ పిల్లల కోసం ప్రతిరోజూ ఎన్నో సేవలు చేస్తున్న అమ్మ, భార్య, సోదరికి పనుల్లో కొంత సాయం చేయాలని పేర్కొంటూ చేసేదే #BeTheREALMAN ఛాలెంజ్.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఛాలెంజ్ తీసుకున్నారు. చిరంజీవి తాజాగా తన ఇల్లు శుభ్రం చేసుకుని, తల్లి కోసం వంట చేసిన ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఇందులో పాల్గొన్న తారలు మాములుగా ఇంటి పనులు చేస్తున్నట్టుగా వీడియోలు పెట్టగా చిరంజీవి మాత్రం తన మాతృమూర్తికి అంజనాదేవికి పెసరట్టు ఉప్మా వేసి ఆమెకు అప్యాయంగా వడ్డించారు.

ఇది అందరినీ ఆకట్టుకుంది. ట్విట్టర్ లో ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతుంది. వూరకే అయిపోరు మెగాస్టార్లు..!! అంటూ అందరూ చిరంజీవి ఇచ్చిన సెంటిమెంట్ టచ్ ని మెచ్చుకుంటున్నారు. చిరంజీవి ఇప్పుడు ఈ ఛాలెంజ్ని ఇప్పుడు చిరంజీవి… తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్ లకు విసిరారు.

చిరంజీవి ప్రస్తుతం ప్లాప్ అనేదే లేనటువంటి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటివరకూ 40% షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 14న విడుదల చెయ్యాలి అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే ఆచార్య అప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది.