chiranjeevi-at-gannavaram-airport-to-meet-ys-jagan-at-tadepalliమెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. వారు ముఖ్యమంత్రిని చిరంజీవి తాజా చిత్రం, సైరా నరసింహ రెడ్డిని వీక్షించాల్సిందిగా ఆహ్వానిస్తారు. వారని ముఖ్యమంత్రి తమ ఇంటికి విందుకు రావాల్సిందిగా ఆహ్వానించినట్టు సమాచారం.

మొదట సైరా నిర్మాత రామ్ చరణ్ కూడా చిరంజీవి వెంట వస్తారని వార్తలు వచ్చినా ఆయన రాలేదు. ఇది ఇలా ఉండగా జగన్ మోహన్ రెడ్డిని కలిసే దిశగా విజయవాడకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. జనసేన అధ్యక్షుడు, సోదరుడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఇరువర్గాల వారు అంటున్నారు. సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సింది గా కోరతారని కూడా వార్తలు ఉన్నాయి. కాగా, చిరంజీవి కోరిక మేరకు ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో సైరా చిత్రానికి దసరా సెలవుల ఎడ్వాంటేజ్ ముగిసిపోయింది. తెలంగాణాలో మాత్రం ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా సెలవులు ఇంకో వారం పెంచారు. కనీసం యావేరేజ్ అనిపించుకోవాలన్నా 80% రికవరీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో అది అంత తేలిక కాదని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మిగతా భాషలలో సినిమా రన్ పూర్తి ఐపోయిందో