Trisha-Chooses-to-Walk-out-on-Megastar-Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో త్రిష ను అనుకున్నారు అయితే ఆమె చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చింది. పైగా ట్విట్టర్ ఎక్కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే సినిమా నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించింది.

సర్లే కదా అని ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ని తీసుకుందాం అనుకున్నారు. కాజల్ ఈ మధ్య వరుస ప్లాపులతో ఆఫర్లు లేకుండా ఉంది. దీనితో అడగగానే ఆమె ఎగిరి గంతేస్తుంది అనుకుంటున్నారు. అయితే ఆమె వర్తమాన స్టార్ హీరోయిన్లతో సమానంగా రెమ్యూనరేషన్ అడిగిందట. అసలైతే ఈ మధ్య ఆమె ఆఫర్లు లేక రెమ్యూనరేషన్ తగ్గించింది.

అయితే వెతుకుంటూ వచ్చిన కారణంగా అమ్మడు చెట్టు ఎక్కి కూర్చుంది. చిరంజీవికి వయసుకు తగ్గ హీరోయిన్లు లేరు. అనుష్క ఏమో అసలు లైమ్ లైట్ లో లేదు. నయనతారని తీసుకుంటే డేట్స్ ఇబ్బంది. పైగా సైరా లో ఆమె హీరోయిన్. దీనితో కాజల్ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇది ఆమె అవకాశంగా మలుచుకుంది.

వరుసగా హీరోయిన్లు షాక్ ఇవ్వడంతో చిరంజీవి కంగుతిన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ పదిహేను రోజుల పాటు నిలిపివేశారు. ఒకరకంగా హీరోయిన్ ని వెతుక్కోవడానికి ఈ టైం ఉపయోగపడుతుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.