Chiranjeevi - Ram Charan - Acharyaచిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, మరియు పూజా హెగ్డే నటించిన ‘ఆచార్య’ బృందం 2021 మే 13 న విడుదల కానున్నందున, సమయానికి షూట్ పూర్తి చేయడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. ఆ రోజున సినిమా విడుదల కావాలంటే… మేకర్స్ మొత్తం షూట్ ను ఏప్రిల్ 30 లోగా ముగించాలి. అయితే అది కష్టంగా మారిందని సమాచారం.

డీహైడ్రేషన్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నందున, ఈ చిత్రం యొక్క నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేయబడింది. త్వరలోనే షూట్‌ను తిరిగి ప్రారంభించి గడువు లోగా షూటింగ్ పూర్తి చెయ్యగలమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ చిత్రం వాయిదా పడనున్నట్టు పుకార్లు ఉన్నాయి.

మే మూడవ వారానికి నెట్టబడవచ్చని అంటున్నారు. ఈ కారణంగానే వెంకటేష్ నారప్ప మే 14న ప్రకటింబడినా చిత్రబృందం క్లాష్ ఉంటుందని తెలిసినా తమ సినిమా వేరే తేదీకి మార్చలేదు. ఆచార్య ఈ నెల 16న కోకాపేటలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాల్సి ఉంది. కాజల్ వచ్చి సినిమాలోని తన మిగతా భాగాన్ని పూర్తి చెయ్యాల్సి ఉంది.

చిరంజీవి కోలుకునేదాని బట్టి షూట్ ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ ఈ చిత్రంలో సిద్ధ అనే అతిధి పాత్రలో నటించనున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేశాడు చరణ్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఒకప్పుడు ఆయన చిరంజీవికి అనేక సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.