‘జబర్దస్త్’ షోలో సాయికుమార్ ను ఇమిటేట్ చేస్తూ, ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్న కమెడియన్ పై పోలీస్ కేసు నమోదైంది. శివరాత్రి పర్వదినాన కార్యక్రమం చేస్తానని చెప్పి, తన వద్ద నుండి 10 వేల రూపాయలు అడ్వాన్స్ క్యాష్ తీసుకున్న అవినాష్, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడని వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో గానీ, ‘జబర్దస్త్’ కార్యక్రమం గానీ, అందులో పార్టిసిపెంట్స్ గానీ ఏదొక రూపేణా వార్తల్లో నిలుస్తుండడం విశేషం. గతంలో పెట్టిన ఓ కేసు నుండి ఇటీవలే నాగబాబు, రోజా, రష్మిలకు విముక్తి రాగా, తాజాగా ముక్కు అవినాష్ పై కేసు నమోదు కావడంతో, మరోసారి ‘జబర్దస్త్’ పేరు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.