Charmi-Kaur- drugs SIT investigationఇప్పటివరకు జరిగిన రెండు రోజుల సిట్ విచారణలో ఎలాంటి ట్విస్ట్ లు లేవు. తొలిరోజు పూరీ జగన్నాధ్ ను దాదాపుగా 11 గంటలు విచారించగా, రెండవ రోజు అయిదారు గంటల పాటు శ్యాం కే నాయుడు విచారణ కొనసాగింది. ఈ విచారణలో డ్రగ్స్ వాడే వారి పేర్లను శ్యాం వెల్లడించినట్లుగా మీడియా వర్గాలు కధనాల సారాంశం. ముఖ్యంగా హీరోయిన్ ఛార్మి డ్రగ్స్ తీసుకుంటుందన్న విషయాన్ని శ్యాం కే నాయుడు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి మరింత బలాన్నిచ్చే విధంగా సిట్ అధికారుల కదలికలు ఉండడం విశేషం.

నేడు నటుడు సుబ్బరాజు విచారణ కొనసాగుతుండగా, శనివారం నాడు తరుణ్ ను, 24న నవదీప్ ను, 25వ తేదీన ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న ఛార్మిని విచారించనున్నారు. అయితే అత్యంత కీలకమైన విచారణగా ఛార్మిది నిలుస్తుందని సమాచారం. ఈ రోజు ఎలాంటి అనూహ్య పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా సిట్ అధికారులు కూడా సంకేతాలు ఇస్తున్నారు.

అందుకే ఆ రోజు మరింతగా బందోబస్తు కావాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు వెళ్ళాయి. ఛార్మి హీరోయిన్ గనుక ఆమె వస్తే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని, శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, అందుకని భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు పూరీ భార్య లావణ్య కూడా ఛార్మి వ్యవహార తీరుతో మిక్కిలి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఛార్మి వలనే తన భర్త పూరీ ఇలా అయిపోయారనేది లావణ్య ఆవేదనగా వస్తున్న కధనాలు.