KA Paulగత వారం శ్రీలంక వెళ్ళి అక్కడ ప్రభుత్వాధినేతతో ఫోటోలు దిగొచ్చిన క్రైస్తవ మతప్రబోధకుడు కేఏ పాల్ కాసేపటిక్రితం హైదరాబాద్ లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ నెల 23 న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియబోతున్నాయన్నారు. తన ప్రజాశాంతి పార్టీకి 100 సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో తేలిందన్నారు. చంద్రబాబుకి రిటైర్ మెంట్ ఇచ్చి మనిద్దరం కలిసి ప్రజల కోసం పని చేద్దామని జగన్ పాల్ ని కోరినట్లు తెలిపారు.

ఇదే సమయంలో ఆయన చంద్రబాబు కు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకుంటే తన కోసం ప్రార్ధించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నీచ రాజకీయాలు చేయడమకంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం మేలని పాల్ వ్యాఖ్యానించారు. నిజాయితీ విషయంలో తనకు ఎవరు సాటి లేరని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ఇంటర్మీడియేట్ మార్కుల వివాదం గురించి కూడా ఆయన స్పందించారు.

ఈ క్రమంలో అయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కేటీఆర్, కవిత ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోగలరా అంటూ నిలదీశారు. కేటీఆర్ ని పూజారులు కూడా కాపాడలేరని పాల్ ఎద్దేవా చేసారు. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.