chandrababu naidu respomds on alliance with congressఒకప్పుడు ఏమి మాట్లాడాలన్నా చాలా ఆచితూచి మాట్లాడే చంద్రబాబు ఈ మధ్య అనాలోచితంగా పదే పదే నోరుజారుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో బాగుండాలన్నదే టీడీపీ లక్ష్యమని, తెలంగాణలో పొత్తుకు కేసీఆర్ నిరాకరించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అంటున్నారు.

శుక్రవారం సీఎం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కూడా బాబు ఇదే మాట మరోసారి అన్నారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకే మహాకూటమిలో చేరామన్నారు. పదే పదే ఈ మాట అనడంతో చంద్రబాబు పలచన అవుతున్నారు. అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారు.

పొత్తు పెట్టుకుందామని చూసి ఇప్పుడు ఏ విధంగా ఆ పార్టీ నేతలు తెరాసను విమర్శిస్తారు. పొత్తుకు ఒప్పుకోలేదు కాబట్టి విమర్శలు చేస్తున్నారు అంటే ఏమని సమాధానం చెబుతారు. ఏదో ఒక సారి అంటే పర్లేదు అదే పనిగా ఈ విషయం ప్రస్తావిస్తే అది తెలంగాణ టీడీపీకి చేటు చేస్తుంది. వయసుతో పాటు చంద్రబాబుకు చాదస్తం పెరుగుతుందా? అని అనిపించక మానదు.