తెలుగు దేశం అభిమానులేంటి? తమ బాలయ్య మీద గరం ఏంటి అనుకుంటున్నారా? నిజమే దీనికి కారణం బాలయ్య ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరికి హాజరు కావడమే. ఇప్పటికే ఈ మహాసభలకు పొరుగు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును పిలవకుండా అవమానించారని వారు రగిలిపోతున్నారు.
కొంతలో కొంత వారికి ఉపశమనంగా ప్రముఖ అవధాని గరిగపాటి నరసింహారావు కుటుంభపెద్ద వంటి తమ ముఖ్యమంత్రి ఆహ్వానించకుండా అవమానించినందుకు వారి ఆహ్వానాన్ని తిరస్కరించి పరువు నిలబెట్టారు అనుకున్నారు. అయితే సొంత బావ, తెలుగు దేశం ఎమ్మెల్యే అయినా బాలకృష్ణ హాజరవడ్డం వారికి మింగుడుపడలేదు.
పైగా మహాసభల్లో ఎన్టీఆర్ బొమ్మగాని, పేరుగాని పలకని పరిస్థితి. అయితే బాలయ్య ది ఇంకో సమస్య చంద్రబాబు సొంత బావ, తెలుగు దేశం ఎమ్మెల్యే అయినా తెలంగాణ గవర్నమెంట్ ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. కాబట్టి వెళ్ళాక మానలేని పరిస్థితి. కాబట్టి వెళ్లి బాబు గారి అభిమానుల కోపానికి గురయ్యారు.
అయితే అక్కడ బాలయ్య స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. వచ్చిన వారంతా గవర్నమెంట్ ని ప్రసన్నం చేసుకునేలా కేసీఆర్ స్తుతి లో మునిగిపోగా ఒక బాలయ్య మాత్రమే తెలుగు బాషా గురించి తెలుగు జాతి గురించి చక్కగా మాట్లాడారు. బహుశా వేదిక మీద ఎన్టీఆర్, చంద్రబాబు గురించి మాట్లాడింది ఆయన ఒక్కరే కావొచ్చు. అయితే బాలయ్య కూడా కేసీఆర్ గురించి పాజిటివ్ గానే మాట్లాడారు లెండి.