Kanna - Lakshminarayana- Narendra - Modiప్రధాని మోడీ చెప్పమన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు చిత్రంగా ఉన్నాయి. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసినా, రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెప్పాలని మోడీ తనకు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

ఎనభై ఐదు శాతం హామీలను నెరవేర్చడం జరిగిందని ,ఎపి ప్రజల వెంట తాను ఉంటానని మోడీ అన్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. జూన్‌ 20 నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం చేపడుతున్నాం అని బాధ్యతలు చేపట్టిన తరువాత మోడీని మొదటిసారిగా కలిసిన అనంతరం కన్నా అన్నారు.

నిజంగా మోడీ ఆ మాట చెప్పినా ఆంధ్రప్రదేశ్ కు ఏంచేశామో ప్రధాని స్వయంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారో తెలుసుకుంటే అది బీజేపీకే మంచిది. 85% హామీలు పూర్తి చేసేశాం అని చెప్పుకున్నా 12 ప్రధాన హామీలు వెంటనే నెరవేర్చాలని సాక్షాతూ కన్నా ఇచ్చిన వినతిపత్రమే లో ఆయనే చెప్పారు. దీనితో హామీలు ఏ మాత్రం పూర్తి చేశారో వారే చెప్పకనే చెప్పారు.