Will-Loan-Waiver-Bring-Chandrababu-Naidu-Back-to-Powerరేపు చంద్రబాబు పుట్టినరోజున చెయ్యబోయే ఒక రోజు నిరాహార దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడి నుండి అనుకోని మద్దత్తు లభించింది. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్ష జాతీయ స్ధాయిలో మంచి ఫలితాలు సాధిస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.

ఒక ప్రైవేటు కార్యక్రమం మీద విశాఖ వచ్చిన ఆయన మీడియాతో ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా స్తామని హామీ ఇచ్చిన భారతీయ జనతాపార్టీ మాట తప్పిందన్నారు. ఆనాడు ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా ప్రస్తావించిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్ర పదవికి రాజీనామా చేస్తే మోదీ, జైట్లీ దిగొస్తారని.. తద్వరా ఫలితం దక్కుతుందని అన్నారు.

టీడీపీ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చెయ్యబోతున్నాయి అనే పుకార్ల నేపథ్యంలో హనుమన్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇవి ఆయన సాధారణంగా చేసిన వ్యాఖ్యలో కాదో చూడాలి. మరో వైపు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా రుచించవు అనే చెప్పుకోవాలి.