vఆదుకోండి… కనికరించండి… జాలి చూపండి… ఇలా పదాలు వేరైనా అనేక రకాలుగా సాయం చేయమని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్న ఆంధ్రప్రదేశ్ మొరలను మోడీ సర్కార్ కాస్త ఆలకించినట్లున్నారు. ఈ ప్రభావంతో 900 కోట్లను ఏపీకి మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి 500 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 200 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ఈ ప్రకటనలో తెలిపింది.

అలాగే పన్నుల వాటాలో భాగంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన 650 కోట్ల రూపాయలను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపింది. ఈ రెండు మొత్తాలతో పాటు మరో 900 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది. అయితే కేంద్రం ఇవ్వాల్సినటువంటి మొత్తంతో పోల్చుకుంటే… ఇవి కొంతే అయినప్పటికీ, ఈ మాత్రమైనా విడుదల చేసినందుకు సంతోషమే అంటున్నాయి రాజకీయ వర్గాలు.