Catherine Tresa to Nandamuri balakrishnaసీనియర్ హీరోలకు ఈ మధ్య కాలంలో హీరోయిన్లు దొరకడం కష్టం అవుతుంది. చిరంజీవి నుండి వెంకటేష్ వరకు ఈ ఇబ్బంది ఉంటూనే ఉంది. స్పీడ్ గా సినిమాలు చెయ్యడం వల్ల బాలయ్యకు ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంది. తాజగా బోయపాటి శ్రీనుతో ఆయన తదుపరి చిత్రం కోసం హీరోయిన్ల వేట మొదలయ్యింది.

ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్ గా కేథరిన్ కంఫర్మ్ అయ్యింది. ఆమె గతంలో బన్నీతో ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలలో చేసింది. బోయపాటి సినిమాలలో (సరైనోడు, జయ జానకీ నాయకా) కేథరన్ ఇంతకు ముందు కూడా రెండుసార్లు నటించింది. దీనితో ఆయన సంప్రదించగానే వెంటనే ఒప్పుకుందంట.

దీనితో ఒక పని ముగిసింది. మిగిలిన హీరోయిన్ల కోసం వేట కొనసాగుతుంది. సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.

2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని సంప్రదించారని సమాచారం. ఇది చాలా పవర్ ఫుల్ పాత్ర అని తెలుస్తుంది. దత్ ఇప్పటికే కేజీఎఫ్ 2లో విలన్ గా నటిస్తున్నాడు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.