case filed on director sushanth reddy “సూపర్ స్టార్ కిడ్నాప్” పేరుతో మహేష్ బాబు చుట్టూ తిరిగే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సుశాంత్ రెడ్డిపై తాజాగా పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేసారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో గల ఓ హోటల్ లో జరిగిన పార్టీకి సుశాంత్ తో పాటు ఈవెంట్ మేనేజర్ రవి వెళ్లారు.

అక్కడికి వరకు సాఫీగా సాగిన సీన్ కాస్త… అక్కడ నుండి యాక్షన్ వైపుకు మళ్ళింది. అంతకు ముందే వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉండగా, వాటిపై వాదోపవాదాలు జరగగా, గొడవ పెరిగి పెద్దదై ఈవెంట్ మేనేజర్ రవిపై సుశాంత్ రెడ్డి చేయి చేసుకునే దాకా చేరుకుందని సమాచారం.

దీంతో రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వివాదంతోనే కాక, గతంలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు నైజీరియన్లతో కలిసి సుశాంత్ పోలీసులకు పట్టుబడ్డాడి వార్తల్లో నిలవగా, మళ్ళీ “సూపర్ స్టార్ కిడ్నాప్” అంటూ స్వీయనిర్మాణ దర్శకత్వం వహించి మరికొన్ని రోజులు మీడియా దృష్టిని గ్రహించారు సుశాంత్.