Business today Magazine - MS Dhoni Court Caseటీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2013లో బిజినెస్ టుడే మేగజీన్ కవర్ పేజ్ పై విష్ణుమూర్తి ఆకారంలో ధోనీ ఫొటో ప్రచురితమైంది. ఈ ఫోటోలో ధోనీ చేతుల్లో ఆయన బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్ కూడా ఉంచారు. ఈ ఫోటో హిందువుల మనోభావాలు గాయపడ్డాయంటూ అనంతపురం జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలయింది.

బెంగళూరు కోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది. ఫైనల్ గా సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. అయితే, ఈ ఫోటో వివాదంలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదని, అందువల్ల కేసును కొట్టివేయాలంటూ ధోనీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు… ధోనీ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదని అభిప్రాయ పడుతూ… కేసును కొట్టివేయడంతో, ధోనీకి ఉపశమనం లభించినట్టైంది.