Burra Katha movie release on 5th July 2019యువ హీరో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘బుర్రకథ’. ఈ సినిమా ప్రముఖ రచయిత డైమండ్ రత్నంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం నిన్న విడుదల కావాల్సి ఉంది అయితే సెన్సార్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు వల్ల వాయిదా పడింది. వాయిదా వల్ల రాజశేఖర్ కల్కి, శ్రీ విష్ణు బ్రోచేవారేవరురా తో పోటీ తప్పింది ఆదికి. అయితే ఇప్పుడు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీదకు పడినట్టు అయ్యింది.

ఎక్కువగా వాయిదా వేసే పరిస్థితి లేకపోవడం వల్ల నిర్మాతలు జులై 5న ఈ సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు. ఆ తారీఖున సమంత ఓ బేబీతో పోటీ పడాల్సి వస్తుంది. అది కల్కి, బ్రోచేవారేవరురా కంటే ఓ బేబీ తో పోటీ ఇంకా కష్టం. మరోవైపు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఓ మోస్తరు ఆసక్తిని పెంచేశాయి. దానితో ఈ సినిమాపై ఆది ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు.

వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో ఆది సాయికుమార్‌ తో పాటు.. దర్శకుడు డైమండ్‌ రత్నబాబు తొలి సినిమా కావటంతో ఈ ఇద్దరి కెరీర్‌లకు ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. బుర్రకథ, ఓ బేబీ కాకుండా దివంగత నటుడు, రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’ కూడా అదే రోజు విడుదల అవుతుంది. అయితే ఆ సినిమాకు పెద్దగా హైప్ లేదు.