Burra Katha Movie release doubt-యువ హీరో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘బుర్రకథ’. ఈ సినిమా ప్రముఖ రచయిత డైమండ్ రత్నంబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రేపు విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావట్లేదు అని సమాచారం. తొలుత నిన్న సెన్సార్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నయని, దానితో ఒక రోజు ఆలస్యంగా అంటే శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా ఈ వారం విడుదల కావడం లేదని తెలుస్తుంది. కొత్త రిలీజ్ డేట్ చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది. అలాగే ఖచ్చితంగా దేనివల్ల సెన్సార్ ఇబ్బంది అవుతుంది అనేది కూడా తెలియరాలేదు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ లు సినిమాపై ఓ మోస్తరు ఆసక్తిని పెంచేశాయి. దానితో ఈ సినిమాపై ఆది ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు.

వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో ఆది సాయికుమార్‌ తో పాటు.. దర్శకుడు డైమండ్‌ రత్నబాబు తొలి సినిమా కావటంతో ఈ ఇద్దరి కెరీర్‌లకు ఈ సినిమా కీలకంగా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. బుర్రకథ వాయిదా పడటంతో ఈ వారం కేవలం రెండు సినిమాలే – రాజశేఖర్ కల్కి, శ్రీ విష్ణు బ్రోచేవారేవరురా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు వీటిలో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.