క్రిస్టియన్ మత ప్రభోదకుడుగా ఉన్న బ్రదర్ అనీల్ను జగన్ వ్యూహాత్మకంగా తెరమీదకు తెస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలే కాలంలో హిందువులను ఆకట్టుకోవడానికి జగన్ చెయ్యని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో క్రిస్టియన్లను దూరం కాకుండా చూసుకునే బాధ్యతను బ్రదర్ అనీల్కు జగన్ అప్పజెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బ్రదర్ అనీల్ ఇటీవల సికింధ్రాబాద్లో తాము నిర్మించిన చర్చిలో పాస్టర్లను పిలిచి జగన్తో సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి జగన్ గైర్హాహాజరు కూడా ఇందుకోసమేనని సమాచారం.
లోటస్ పాండ్ నుంచే బ్రదర్ అనీల్ కుమార్ ఏపీలోని అన్ని చర్చీలకు, పాస్టర్లకు గిఫ్ట్లు పంపుతూ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అవసరమైతే తాను కూడా ఎన్నికల బరిలో పోటీ చేయవచ్చన్న సంకేతాలు పార్టీ వర్గాలకు ఇచ్చినట్టు సమాచారం.
వారం క్రితం రాంగోపాల్ వర్మతో రహస్య సమావేశం కూడా అనీల్ నిర్వహించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా చంద్రబాబు వ్యతిరేకంగా తీసేలా ఆయనను అనీల్ ప్రోత్సహించినట్టు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఒకరు ఆ సినిమాని నిర్మిస్తున్నారు .
గత ఎన్నికల్లో జగన్ చెల్లి షర్మిళ ప్రచారం చేశారు. ఆమె కొంత దూరం పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు బావ అనీల్ కూడా రంగంలోకి దిగారు. ఈ సారి అయినా జగన్ కలిసొస్తుందో లేదో చూడాలి. నవంబర్ 2 నుండి జగన్ అన్నొస్తున్నాడు పేరుతో 3500 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు.