Botsa Satyanarayana YSRCP  announces 1 crore  donation for Kerala floodsకేరళ వరద బాధితుల సహయార్ధం వైఎస్సార్ కాంగ్రేస్ కూడా స్పందించి ముందుకు వచ్చింది. ఆ పార్టీ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ కాసేపటికి క్రితం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తరపున కేరళ కు సహాయం అందించిన రాజకీయ పార్టీ వైకాపా మాత్రమే. దీనికి వారిని అభినందించాలి.

కాగా ఎపి ఎన్జీవోల సంఘం కేరళకు పాతిక కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఎపి ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ప్రకటించగా ఎన్జీవోల సంఘం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం స్వయంగా పాతిక కోట్ల రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రికి అంద చేయగా, ఎపి లో ఎన్జీవోల సంఘం ఇస్తుండడం విశేషం.

మరోవైపు అనేక మంది సినీ తారలు, స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. సొమ్ము రూపంలోనే కాకుండా వస్తురూపంలో కూడా ప్రజలు విరాళాలు అందిస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని నగదు, దుస్తులు, తినుబండారాలు, మంచి నీరు, నిత్యావసర వస్తువులు.. ఇలా తమకు తోచిన విధంగా సహాయం చేశారు. ఒక్క హైదరాబాద్ నగరం నుండే కేరళకు ఇప్పటికే 200 లారీల నిత్యవసర వస్తువులు వెళ్లాయట