వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభిమానులు చివరికి మనకే అనుమానం వచ్చే రీతిలో ఇలాంటి అబద్దపు ప్రచారం చేస్తారని ఆయన హెచ్చరించారు.
వైకాపా బీజేపీ పొత్తు ఉండబోతుందని గట్టిగా ప్రచారం చేస్తున్నారని దానిని తిప్పికొట్టాలని బొత్స కార్యకర్తలకు చెప్పారు. టిడిపి, బిజెపి నాలుగేళ్లు కలిసి పనిచేసి ఇప్పుడు విడిపోయి,వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై అభాండాలు మోపుతుంటారని ఆయన అన్నారు.తమ అద్యక్షుడు జగన్ చాలా స్పష్టంగా చెప్పారని, బిజెపితో సహా ఏ పార్టీతో పొత్తు ఉండదని చెప్పారని ఆయన అన్నారు.
వైకాపా బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్ళబోతున్నాయి అనే వార్తలతో మైనారిటీ, దళితుల ఓట్లు పోతాయి అనే భయం మొదలయ్యింది ఆ పార్టీ వారికి. మొదటినుండి ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ కు ఆ తరువాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు బలంగా నిలబడ్డాయి. ఇప్పుడు ఈ వార్తలతో వారు జారిపోతారు అనే భయం ఆ పార్టీ నేతలలో కనిపిస్తుంది.