Bonda Uma fires on YSRCPలక్షలాది మందికి కుచ్చుటోపీ పెట్టిన ‘అగ్రిగోల్డ్’ వ్యవహారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనట. ఈ మేరకు నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేసారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చకు వైసీపీ పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా వైసీపీ వాదనను తిప్పికొడుతూ బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

“2003 దాకా అగ్రిగోల్డ్ వ్యాపారం విలువ 100 కోట్లు కూడా దాటలేదన్న బొండా ఉమా, వైఎస్ అధికారం చేపట్టగానే ఆ సంస్థ నలుదిశలా విస్తరించిందని, అంతేకాక అనతి కాలంలోనే ఆ సంస్థ వ్యాపారం వేల కోట్లకు చేరిందన్నారు. వైఎస్ అండ చూసుకునే… అగ్రిగోల్డ్ చైర్మన్ ఏవీ రామారావు చక్రం తిప్పారని, అయితే తాము అధికారంలోకి రాగానే జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ పై కేసులు నమోదు చేశామని, ఎక్కడెక్కడో ఉన్న సంస్థ ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని” బొండా చేసిన వ్యాఖ్యలు సభలో మరోసారి కలకలం సృష్టించాయి.