bolisetty satyanarayana comments about perni naniగడిచిన మూడు, నాలుగు రోజులుగా సినిమా – రాజకీయం రెండు మిళితం అయిపోయాయి. “భీమ్లా నాయక్” సినిమా విడుదల తర్వాత సినీ ప్రేక్షకుడి కదిపినా, రాజకీయ నాయకుడు మాట్లాడినా, పలికెడి పవన్ సినిమా గురించే! అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి ప్రస్తుతం పాలిస్తోన్న పాలకులు పేర్ని నాని వరకు అందరూ ‘భీమ్లా నాయక్’ నామస్మరణే!

ఈ క్రమంలో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ తర్వాత పేర్ని నాని పెట్టిన ప్రెస్ మీట్ పై ఓ మీడియా ఛానల్ చర్చలో పాల్గొన్న ప్రముఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. “పేర్ని నాని, ఓ బుద్ధి లేని మనిషి, ఆయన గురించి మాట్లాడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అతను మంత్రిగా ఎలా కొనసాగుతున్నాడో” అసలు తీవ్ర పదజాలంతో స్పందించారు.

పేర్ని నాని, కొడాలి నాని వంటి వాళ్ళు మంత్రులుగా ఉండడానికి అనర్హులని, ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేలుగా ఉండడానికి వారికి అర్హత లేదని, వీళ్ళని ఎంచుకున్న ప్రజలది తప్పా? లేక బలవంతంగా ఓట్లు వేసేసుకుని గెలిచారో తనకు తెలియదు గానీ, బుద్ధి లేకుండా మాట్లాడతారు. బుద్ది ఉన్నోడు ఎవడు కూడా వాయిదా వేసుకోమని చెప్పరని, నిజంగా వీళ్లకు చేయాలని ఉంటే మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు కదా అని పేర్కొన్నారు.

అసలు జాయింట్ కలెక్టర్లు చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గానీ, ఈ మంత్రులు గానీ పరిపాలనకు అనర్హులు అని తానంటానని, వీళ్లకు వేరే పనులేవీ లేవా అంటూ నిలదీసారు. ‘భీమ్లా నాయక్ విడుదలకు ముందు నుండి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉన్న ఈ జనసేన నేత, వరుసగా అనేక ట్వీట్లు చేసి వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.

“పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవానికి – వైఎస్ జగన్ అహంకారానికి మధ్య జరుగుతోన్న యుద్ధంగా” సినిమాలోని డైలాగ్ ను గుర్తు చేసే విధంగా విమర్శించారు. అలాగే ‘అడవంటే అమ్మ కాదురా తప్పుచేసినా కాపాడడానికి… అమ్మోరు! ఎమ్మెల్యే, ఎంపీలను కాదురా నా కొడకా నా చెల్లిపేరు చెప్పి ఉంటే వదిలేసే వాడ్నిరా’ అంటూ సినిమా చూసిన తర్వాత డైలాగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.