BJP Senior Ram Madhav to Contest from Telanganaరాష్ట్ర బీజేపీ నాయకులు తమ సొంతంగా నాలుగు సీట్లు తెచ్చుకోలేరుగా గానీ ప్రగల్భాలకు మాత్రం లోటు ఉండదు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఏకంగా టీడీపీలోనే చీలిక రాబోతుందని జోస్యం చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ టిడిపి ధోరణి ఆ పార్టీలోని పలువురు సీనియర్ లకు నచ్చడం లేదని అన్నారు.

ఆంద్రుల పరువు పొగొట్టే విదంగా టిడిపి ఎమ్.పిలు పార్లమెంటులో వ్యవహరించారని, దీనిని పలువురు టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మాధవ్ వ్యాఖ్యానించారు. దాంతో వారిలో కొందరు తిరుగుబాటుకు సన్నద్దమవుతున్నారన్న అబిప్రాయం కలుగుతోందని ఆయన చెప్పారు.

బీజేపీ టీడీపీలో చీలిక తెస్తుందా? బాబు ప్రభుత్వాన్ని మోడీ పడగొడతారా అని పలువురు సందేహపడుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి సాహసం చేయ్యరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా బీజేపీ నాయకులు అదిచేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం ఆ తరువాత ఏమి జరగకపోవడం అందరికి తెలిసిందే