bhuma-akhila-priya-reddy-weddingఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహ వేడుకను అత్యంత ఘనం గా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక లారీలోడ్ ఆహ్వాన పత్రికలు తయారు చేయించారని ఒక జాతీయ పత్రిక కదనం ఇచ్చింది. వాటిని ముప్పై వేల మందికి ఆళ్లగడ్డ నియోజకవర్గం, నంద్యాల నియోజకవర్గంలో ను అబిమానులు, పార్టీ కార్యకర్తలకు పంపిణీ చేయనున్నారు.

ఈ నెల 29న శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వివాహం జరుగుతుంది. మునిసిపల్ మంత్రి పి.నారాయణకు సమీప బందువైన భార్గవ్ తో అఖిలప్రియ వివాహం జరగబోతోంది. గవర్నర్ నరసింహన్ ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో సహా పలువురు ప్రముఖలు, అలాగే తెలంగాణ మంత్రులను ఆహ్వానిస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో పెళ్లి ఆర్బాటంగా చేయ్యబోతున్నారు. దాదాపుగా నియోజకవర్గంలో తమ వర్గాన్ని మొత్తం పెళ్లికి పిలుస్తున్నారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి అకాలమరణంతో అఖిలప్రియకు మంత్రివర్గం యోగం వరించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె తన తల్లి మరణాంతరం ఆవిడ సీటు నుండి పోటీ చేసి గెలిచారు.