రానూరానూ రంగుల ప్రపంచం కళావిహీనంగా మారిపోతోంది. ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమవుతున్న వారంతా ఒక్కొక్కరుగా వారికి వారే అశువులు బాస్తున్నారు. తాజాగా అదే కోవలో బెంగాలీకి చెందిన నటిమణి పాయల్ చక్రబోర్తి కూడా చేరింది. 38 ఏళ్ళ ఈ నటి సిలిగురిలో ఓ హోటల్ లో విగతజీవిగా కనిపించింది.
తనను ఎవరూ డిస్టబ్ చేయవద్దని చెప్పి మంగళవారం నాడు హోటల్ రూమ్ లోకి వెళ్ళిన పాయల్, బుధవారం ఉదయం ఎంత పొద్దుపోయినా తలుపులు తీయకపోవడంతో, అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు పగలగొట్టగా ఫ్యాన్ కు వేలాడుతూ దర్శనమిచ్చింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, అయితే ఇటీవలే తన భర్తతో విడాకులు తీసుకున్న పాయల్, తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. ఆత్మహత్యగా భావిస్తున్నామని, అయినా పోస్ట్ మార్టం తర్వాత ఏ విషయమో చెప్తామని పోలీసులు తెలిపారు. తన రెండేళ్ళ కుమారుడితో కలిసి తన తల్లి వద్దే పాయల్ ఉంటున్నట్లుగా సమాచారం.