టాలీవుడ్ లోనే ఆపసోపాలు పడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. పాపులర్ ఫిలిం మేకర్ డా. జయంతిలాల్ గడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని బాలీవుడ్ లోకి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. తెలుగులో పెద్ద హిటైన ఛత్రపతి సినిమా రీమేక్ కావడం విశేషం.
అల్లుడు శ్రీనుతో సాయిని టాలీవుడ్ కి పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ సినిమా వినాయక్ బాలీవుడ్ అరంగేట్రం కూడా. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… కేరీర్ మొదట్లో రాజమౌళి, వినాయక్ పోటాపోటీగా ఉండే వారు ఇప్పుడు వినాయక్ రాజమౌళి సినిమాని రీమేక్ చెయ్యడం విశేషం.
ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి జనరేషన్స్కి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో వినాయక్ పెద్దగా ఫామ్ లో లేరు. కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్తో వినాయక్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
ఇటువంటి పరిస్థితిలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్కి సంబందించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. బెల్లంకొండ ప్రస్తుతం తెలుగులో అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.