beggars back on hyderabad traffic roadsహైద్రాబాద్లో అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ రావడంతో ఇక్కడి అధికారులు రోడ్ల మీద ఉన్న బిచ్చగాళ్లను పోలీసులు అరెస్టు చేసి జైలు ఆనందాశ్రమానికి పంపించారు. అయితే ఇవాంకా వెళ్లిపోవడంతో వీళ్లందరినీ మళ్లీ విడిచిపెట్టారు.

బిచ్చగాళ్లకు పునరావాసం కల్పిస్తామనే మాటలు కాగితాలకే పరిమితం కాగా మళ్లీ నగర వీధుల్లో బిచ్చగాళ్ల సందడి మళ్లీ పునర్ ప్రారంభమైంది. బిచ్చగాళ్లు యాచన చేయకుండా వారికి జైలు పెట్రోలుబంక్ లు, స్టోర్లలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఇదివరకు చెప్పిన మాటలు ఏవి జరగలేదు.

మరోవైపు ఇవాంకా కోసం బిచ్చగాళ్లను తరలించడం లేదు అని పోలీసులు చెప్పినమాటలు ఆవిడ వెళ్ళగానే వదిలేయ్యడంతో నిజం కాదని తేలిపోయాయి. మరోవైపు అధికారులు మాత్రం వారిని పట్టుకునేందుకు ఈ నెల 25వతేదీ నుంచి దాడులు చేయాలని నిర్ణయించారు. చూడాలి వారి నిబద్దత ఏమాత్రం నిజమో?