Balakrishna warns narendra modiహిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గతంలో మాకీ… అంటూ సంబోధించి పెద్ద ఎత్తున వివాదానికి కారణం అయ్యారు. ప్రధాని స్థాయి వ్యక్తిని అటువంటి నీతిబాహ్యమైన మాటలు అంటారా అంటూ ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. అయితే బీజేపీ మీద ఉన్న కోపంతో బాలయ్యకు మెజారిటీ ప్రజలనుండి ఆ విషయంలో పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య మరోసారి ప్రధానిపై విరుచుకుపడ్డారు.

ఈరోజు హిందూపురంలో రోడ్‌ షో నిర్వహించిన బాలయ్య మోదీ నిజంగా మగాడైతే తన తిట్లకు సముద్రంలో దూకి చావాలని వ్యాఖ్యానించారు. మోదీకి సిగ్గు, శరం లేవని.. కేసీఆర్‌, జగన్‌, మోదీ తననేమీ చేయలేరని బాలకృష్ణ వ్యాఖ్యానించడం విశేషం. బాలయ్య ప్రధాని మీద అన్న మాటలకు సభలోని వారి నుండి కేరింతలు రావడం గమనార్హం. బీజేపీ పై రాష్ట్రంలో తీవ్రమైన కోపం ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ లో సీట్లు గెలుచుకోవడం మాట దేవుడెరుగు ఈ సారి డిపాజిట్లు దక్కించుకోలేని పరిస్థితి.

మరోవైపు బాలయ్య విషయానికి వస్తే… ఈ మధ్య కాలంలో వరుస వివాదాలతో వార్తలలో నిలుస్తున్న బాలయ్య మరోసారి గెలవడం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. హిందూపురంలో టీడీపీ తిరుగులేని శక్తి. ఎన్టీఆర్ ఆ పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో వరుసగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇక్కడ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి హరికృష్ణ కూడా ఒక సారి ఎన్నికయ్యారు