balakrishna-sye-raa-narasimha-reddy-celebrationప్రపంచానికి తెలియని స్వాతంత్ర సమరయోధుడి కథ తీసిన సైరా నరసింహారెడ్డి టీంకు కళాబంధు టీ సుబ్బిరామి రెడ్డి నిన్న రాత్రి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైరా చిత్రయూనిట్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్నారు. చిరంజీవి సమకాలికులైన బాలకృష్ణ, వెంకటేష్ కూడా హాజరుకావడం విశేషం.

నాగార్జున రావాల్సి ఉన్నా గోవా హాలిడేలో ఉండటంతో ఆయన రాలేదు. ఈ పార్టీకి బాలయ్య హైలైట్ గా నిలిచారు. ఎన్నికల ముందు బాలయ్య మీద మెగా బ్రదర్ నాగబాబు భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. అనేక వీడియోలు పోస్టు చేసి బాలయ్యని హేళన చేశారు. హిందూపురంలో ఎలా గెలుస్తాడో చూస్తాం అన్నారు కూడా ఒకానొక సందర్భం.

ఎన్నికల సందర్భంగా కూడా బాలయ్య నాగబాబు మీద స్పందించలేదు. ఇప్పుడు కూడా బాలయ్య అవేమీ మనసులో పెట్టుకోకుండా ఫంక్షన్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఈ పార్టీకి గతంలో చిరంజీవితో వైరం ఉన్న రాజశేఖర్ కూడా అటెండ్ కావడం విశేషం. వరుణ్‌ తేజ్‌, బోనీ కపూర్‌, అజారుద్ధీన్‌, నిర్మాత అల్లు అరవింద్‌, మురళీమోహన్‌ కూడా పాల్గొన్నారు.

అయితే కలెక్షన్ల పరంగా సైరా వెనుకబడే ఉందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు అటుఇటుగా 60% రికవరీ మాత్రమే నమోదు చేసింది. కనీసం యావేరేజ్ అనిపించుకోవాలన్నా 80% రికవరీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో అది అంత తేలిక కాదని తెలుస్తుంది. ఈ వారాంతంలోని కలెక్షన్లు సినిమాకు కీలకంగా ఉండబోతున్నాయి.