Balakrishna -Boyapati-Srinu-లాక్డౌన్ కారణంగా మొదటి షెడ్యూల్ ముగిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో బాలయ్య అగోరాగా కనిపించే సన్నివేశం ఒకటి ఉంది. ఈ ఎపిసోడ్‌ను వారణాసిలో చిత్రీకరించాలని బోయపాటి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రమాదకరమైన పరిస్థితిని బట్టి షూటింగ్ ప్రణాళిక మార్చవచ్చు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నెలలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం సురక్షితం కాదని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు, హైదరాబాద్ లోని కొన్ని ఫిల్మ్ స్టూడియోలో నిర్మించిన సెట్లో ఈ సన్నివేశం షూట్ పూర్తి చేయాల్సి ఉంది. మరొక వైపు, బోయపాటి ఈ చిత్రంలో అగోరా పాత్ర కోసం రెండు స్కెచ్‌లు సిద్ధం చేశాడట.

ఈ పాత్ర యొక్క మేకప్ టెస్టులు లాక్డౌన్ తర్వాత జరుగుతుంది. దాన్నిబట్టి ఒక గెట్ అప్ ఫైనల్ చేస్తారు. బాలకృష్ణ 2019 లో మూడు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక విజయాన్ని నమోదు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నటుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తన అదృష్ట దర్శకుడు బోయపతి శ్రీనుతో జతకడుతున్నాడు.

వీరిద్దరూ గతంలో రెండు బ్లాక్ బస్టర్లను (సింహ, లెజెండ్) అందించడంతో ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే షూటింగ్ మొదలు పెడతారు. అన్నీ కుదిరితే… 2021 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.