సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చివరి రోజులలో జరిగిన సంఘటనలను లక్ష్మి పార్వతి కోణంలో తీసిన సినిమా అది. దాంట్లో చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కొడుకులను కూడా విలన్లుగా చూపించాడు వర్మ.
ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో పి. విజయకుమార్ అనే ఆర్టిస్టు నటించారు. అయితే ఇప్పుడు ఆయన సతీమణి గారు క్యాన్సర్ బారిన పడ్డారట. గతంలో జరిగినవి ఏవీ మనసులో పెట్టుకోకుండా ఆమెకు బాలయ్య తన బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లోనే చికిత్స అందిస్తున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ వార్త నిజమో కాదో ఇప్పటివరకూ ధృవీకరణ కాలేదు. అయితే నిజం అయితే మాత్రం బాలయ్య సూపర్ అబ్బా! బాలయ్యపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిన క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆయన చేసే సేవలను మాత్రం ఎవరైనా మెచ్చుకోవలసిందే. మా బాలయ్య బంగారం అంటూ మురిసిపోతున్నారు అభిమానులు.
ఇది ఇలా ఉండగా బాలయ్యకు 2019 ఏ మాత్రం కలిసి రాలేదు. ఒక్క ఎన్నికలలో గెలుపు తప్ప అన్ని నిరాశపరచాయి. మూడు సినిమాలు విడుదల కాగా మూడు ప్లాపులుగా మిగిలాయి. దీనితో 2020 గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలయ్య, ఆయన అభిమానులు. ఈ ఏడాది ఆయనకు తనకు బాగా కలిసివచ్చిన బోయపాటి శ్రీనుతో సినిమా చెయ్యబోతున్నారు.