Balakrishna in Ayyappanum Koshiyum remakeస‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ని ఇప్పటికే తెలిసిందే.

ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు డైరెక్టర్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఒకసారి ఫైనల్ అయ్యాకా బాలకృష్ణని సంప్రదించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో రెండో హీరో ఎవరు అనేది కూడా కీలకంగా ఉంటుంది బాలయ్య లాంటి స్టార్ హీరోని తీసుకుంటే.

బాలయ్య 2019లో మూడు ప్లాపులు మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం తనకు ఎంతగానో కలిసొచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఒక షెడ్యూల్ తరువాత కరోనా వైరస్ భయం వల్ల షూటింగ్ ఆగిపోయింది. సితార ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది.

బాడ్ సీజన్ లో రిలీజ్ కాకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది ఆ సినిమా. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ప్ర‌స్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌ల‌తో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌. నాగ‌శౌర్య‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే జులై 30న, శ్యామ్ సింగ‌రాయ్‌ డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.