రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నందమూరి బాలకృష్ణ తన శైలిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మొదటిసారి హిందూపురంలో గెలిచిన తర్వాత జనాలను పట్టించుకోవడం మానేశారని విమర్శలను ఎదుర్కొన్నారు. విమర్శలు వచ్చినా, జగన్ వేవ్లోనూ బాలయ్య హిందూపురంలో రెండోసారి గెలవడం అక్కడ ఆయనకున్న క్రేజ్కి నిదర్శనం. నిన్న తన నియోజకవర్గంలోని ముస్లింలకి ఇఫ్తార్ విందు ఇచ్చారు ఆయన. వారితో కలిసి భోజనం చేశారు. ఆనందంగా వారితో ముచ్చటించారు.
ఈ క్రమంలో అక్కడ ఉన్నటుండి వర్షం కురిసింది. ఓపెన్ గ్రౌండ్ లో విందు పెట్టుకోవడంతో కొంత రసాభాసా అయ్యిందట. అక్కడ ఉన్న వారి హడావుడితో కొంత ఇబ్బంది కరమైన పరిస్థితిలు ఏర్పడినా బాలయ్య తన సహజ శైలికి భిన్నంగా మౌనంగానే ఉండి అందరినీ ఆశ్చర్యపరిచారట. దీనితో అక్కడ ఉన్న వారంతా బాలయ్య మీద ప్రశంసల వర్షం కురిపించారు. స్థానికి టీడీపీ నాయకులు, అభిమానులు కూడా బాలయ్యలో వచ్చిన ఈ మార్పును స్వాగతిస్తున్నారు.
మరోవైపు కె.ఎస్.రవికుమార్ డైరక్షన్లో సీ కల్యాణ్ నిర్మాణంలో వచ్చేబాలయ్య తదుపరి మూవీ ఆగిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. అయితే వేరే కథతో వస్తే కలిసి చేద్దామని ఆ దర్శకుడికి బాలయ్య చెప్పారట. మరో కొత్త కథ సిద్ధమయ్యేదాకా బాలకృష్ణ వేచి చూస్తాడో లేక ముందుగా బోయపాటి తో అనుకున్న సినిమాను లైన్ లో పెడతాడో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమా ఆగిపోయి బోయపాటి సినిమా పట్టాలు ఎక్కితే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు.