Balakrishna -Boyapati-Srinu-నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రోజూ వారీగా వస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న మే 21న సినిమాలు విడుదల చెయ్యాలనే ఆలోచన ఉందని ఒక వార్త వచ్చింది. అయితే ఇప్పుడు నందమూరి అభిమానులకు పిడుగు లాంటి వార్త ఒకటి వచ్చి పడింది. ఈ సినిమాను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తాత్కాలికంగా ఆపేశారట.

ఈ సినిమా కోసం బోయపాటి 15 కోట్లు, బాలయ్య 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అంత మొత్తంలో ఇస్తే సినిమా బడ్జెట్ 60 కోట్లు దాటుతుందని సమాచారం. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి ఉన్న ఫామ్ కు ఇది చాలా రిస్క్ అనే చెప్పుకోవాలి. దీనితో రెమ్యూనరేషన్లు తగ్గించుకుని, లాభాలలో వాట తీసుకోవాలని నిర్మాత అడుగుతున్నడట.

ఈ పంచాయితీ తేలేవరకు సినిమా ఆగిపోయినట్టే అంటున్నారు. సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.

ఈ తరుణంలో ఈ వార్త నందమూరి అభిమానులకు మింగుడుపడటం లేదు. 2019 సంవత్సరం నందమూరి బాలకృష్ణ కేరీర్ లోనే అత్యంత నిరాశాజనకమైన సంవత్సరంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది బాలయ్య నుండి మూడు సినిమాలు వచ్చాయి. సంవత్సరం మొదట్లో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, చివర్లో వచ్చిన రూలర్ పూర్తిగా నిరాశపరిచాయి.