Balakrishna Akhandaనందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం #NBK107 ఈ నెల మొదట్లో అధికారికంగా ప్రకటించారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్మించనున్నారు.

డైరెక్టర్ నుండి నిర్మాతల వరకు ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాకు అన్నీ సరిపోయిన ప్రాజెక్ట్ అంటే ఇదే. 2018లో విడుదలైన జైసింహా తరువాత బాలకృష్ణ కు హిట్ అనేది లేదు. జైసింహా కూడా కమర్షియల్ గా వర్క్ అవుటైనా ఫ్యాన్స్ కు అంతా నచ్చిన సినిమా కాదు. దీనితో అఖండ, ఈ సినిమా మీద అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా మీద వారికి ఒక డౌట్ మొదలయ్యింది. ఈ సినిమా మెయిన్ హీరోయిన్ గా త్రిష, సెకండ్ హీరోయిన్ గా మెహ్రీన్ ని అనుకుంటున్నారని సమాచారం. త్రిష విషయంలో ఫుల్ హ్యాపీ అయితే మెహ్రీన్ విషయంలోనే డౌట్ పడుతున్నారు. మెహ్రీన్ యంగ్ హీరోయిన్ బాలయ్య పక్కన సరిపోకపోతే నెగటివ్ అవుతుంది. విమర్శలు వస్తాయి.

అయితే గోపీచంద్ ఉన్న ఫామ్ కు.. అలాగే ఇప్పటిదాకా అన్నీ బాగా సెట్ చేసిన వైనంతో దర్శకుడికి బాలయ్య ఫ్యాన్స్ బెనిఫిట్ అఫ్ డౌట్ ఇస్తున్నారు. మరోవైపు… అఖండ చివరి షెడ్యూల్ జులై మొదటివారంలో మొదలు అవుతుంది. ఆ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి వినాయక చవితికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.