ayyappanum-koshiyum-telugu-remakeస‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర ‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ని ఇప్పటికే తెలిసిందే.

బిజూ మీనన్ పాత్రకు బాలయ్య కోసం ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు రానా, రవితేజలతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రానికి స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మను అనుకుంటున్నట్టు సమాచారం. స్వామిరారా తరువాత ఆ దర్శకుడి హిట్ అనేది లేదు. దోచెయ్, కేశవ, రణరంగం వంటి మూడు ప్లాపులు వచ్చాయి.

దీనితో ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. తొందరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. మలయాళంలో సక్సెస్ అయిన ఈ చిత్రంలో మిగతా భాషలలో ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనేది చూడాలి.

Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here