Aravinda-Sametha-Not-Worried-–Going-As-Plannedతండ్రి హరికృష్ణ చనిపోయిన బాధను దిగమింగుకుని, వెనువెంటనే షూటింగ్ లో పాల్గొని విడుదల విషయంలో ఉన్న సందేహాలను తొలగించిన జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” ఆడియో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఈ నెల 20వ తేదీన చాలా సింపుల్ గా “అరవింద సమేత” ఆడియోను విడుదల చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని నోవాటెల్ లో చిత్ర యూనిట్ మరియు కొద్దిమంది అభిమానుల సమక్షంలో ఆడియోను సాదాసీదాగా విడుదల చేయాలని భావించారట. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన విషాదాన్ని దృష్టిలో పెట్టుకునే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సమకూర్చారు. గతంలో ఎన్టీఆర్ – థమన్ కాంబోలో ‘బృందావనం’ సినిమా ఆడియో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘రభస’ అంతగా ఆదరణకు నోచుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో మూడవ ఆల్బమ్ గా “అరవింద సమేత” నిలవనుంది.