సినిమాల్లో కష్టాలు ఉండటం మాములే అయితే సినిమా వాళ్ళకు సినిమా కష్టాలు వస్తేనే ఇబ్బంది. ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది మురుగదాస్ పరిస్థితి. ఆయన ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా వల్ల తాము కోట్లాది రూపాయలు నష్టపోయామని పంపిణీదారులు రోడెక్కారు.
పంపిణీదారులు నిన్న రజనీకాంత్ ఇంటి ముందు కూడా నిరసన తెలిపారు. రజనీకాంత్ను కలవడానికి వస్తే ఇందుకు ఆయన నిరాకరించారని ఆరోపించారు. తాము రజినీకాంత్, మురుగదాస్ లను నమ్మి సినిమాపై భారీగా డబ్బులు పెట్టామని వారు తమను ఆదుకోవాలని వారందరు డిమాండ్ చేశారు.
ఈ రోజు మురుగదాస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి సినిమా పంపిణీదారుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనకు పోలీసు ప్రొటక్షన్ ఇప్పించాలని ఆయన కోరాడు. దీనిపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. మరోవైపు, రజినీ, మురుగదాస్ ల వైఖరికి నిరసనగా పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.
మరో వైపు రజినీకాంత్ ప్రస్తుతం హైదరాబాద్ లో తన తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సిరుత్తై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ అని అంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. అందులో రెండు అతిథి పాత్రలు చేసిందనుకోండి.. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’.. మొన్నటికి మొన్న మురుగదాస్ ‘దర్బార్’ సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, నయనతార.