అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైజ్ జీరో’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపుగా 20 కేజీల బరువు పెరిగింది అనే విషయం తెల్సిందే. సినిమా కోసం ఈమె పడ్డ కష్టం వెండి తెరపై కనిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని, తప్పకుండా అనుష్కకు ఈ సినిమా మరింత మంచి పేరును తీసుకు వస్తుందని సినీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ సినిమాకు ముందు అనుష్క ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లను దక్కించుకున్నాయి. దాంతో ఈ సినిమా కూడా అనుష్కకు సక్సెస్ను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఆమె సన్నిహితులు ఉన్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆర్య మరియు సొనాల్ చౌహాన్లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ సినిమాకు చిత్ర యూనిట్ సభ్యులు భారీ పబ్లిసిటీ చేశారు. దాంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పాటు అయ్యింది. దాంతో తెలుగు మరియు తమిళంలో భారీగా ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా అన్ని రకాలుగా కూడా పాజిటివ్ బజ్తో విడుదల అవ్వబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క నటించడం, తర్వాత కథ, కథనం సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా అన్ని మంచి శకునాలతో ‘సైజ్ జీరో’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.