“గోపాల… గోపాల…” ఆడియో వేడుకపై సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అలాగే అదే ఆడియో వేడుకపై తనతో మరిన్ని సినిమాలకు కలిసి పని చేస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించిన పవన్… అనూప్ గుండెల్లో ఆశలు చిగురింపచేసాడు. ఇది జరిగి ఒక ఏడాదిపైనే గడిచింది. అప్పటినుండి పవన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా మాత్రమే చేస్తున్నాడు.
అయితే తాజాగా పవన్ తదుపరి చిత్రానికి అనూప్ రూబెన్స్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. “ఖుషీ” ఫేం యస్.జే.సూర్య దర్శకత్వంలో ఆ సినిమాకు సీక్వెల్ గా పవన్ అంగీకారం తెలిపారని వచ్చిన వార్తలు నిజమయ్యాయి. రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు సూర్య, సంగీత దర్శకుడు అనూప్ లు ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తూ… పవన్ ఇచ్చిన మాటకు ఉన్న “విలువను” చాటిచెప్తోంది