Chandrababu-Naidu,-Keep-Anna-Canteens-Away-from-Unnecessary-Add-Onsబీజేపీ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు కీలకం కాబోతున్నారా అంటే పరిస్థితులు అవును అనే అంటున్నాయి. చంద్రబాబుకు బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో ఢిల్లీలో నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ ఆహ్వానం పంపారు. . బుధవారం పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు మమతాబెనర్జీని కలిశారు.

ఈ సందర్భంగా జాతీయ, ఏపీ రాజకీయాలపై ఎంపీలతో మమత చర్చించారు. ఈ సందర్భంగా ఈ విషయం చెప్పి తొందరలోనే తానే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించబోతున్నట్టు చెప్పారు. మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో బీజీగా గడిపారు. కడప ఉక్కు పరిశ్రమపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి వినప్రతం ఇచ్చారు.

అంతేకాకుండా కేంద్ర ఉక్కుమంత్రి బీరేంద్రసింగ్‌ను టీడీపీ ఎంపీలు కలిశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రతి రోజూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కూడా తెలుపుతున్నారు. అయితే ఎన్ని చేసినా కేంద్రం దిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు.