ఒకప్పుడు సోషల్ మీడియాలోని ఫాలోయింగ్ తో చక్రం తిప్పి 2014 ఎన్నికలలో గెలిచిన బీజేపీకి ఇప్పుడు అక్కడే చుక్కెదురవుతుంది. తెలుగు వారి సర్జికల్ స్ట్రైక్ తో బీజేపీ ఫేస్బుక్ పేజీపై రేటింగ్ పడిపోయింది. యువత బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలంటూ బీజీపీ పేస్బుక్ పేజీకీ తక్కువ రేటింగ్ ఇస్తున్నారు.
దీంతో బీజేపీ పేజీలో రేటింగ్ ఆప్షన్ను డిజేబుల్ చేశారు. పేజీ రేటింగ్ ఒక్కసారిగా 1.1కి పడిపోయింది. ఈ పేజీకీ దాదాపు 35 వేలకు పైగా 1పాయింట్ రేటింగ్ ఇచ్చారు. గతంలో 17వేల మందికి పైగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ యువత కాంపెయిన్తో కేవలం రెండు రోజుల్లోనే ఒక్కసారిగా బీజేపీ పేజీ రేటింగ్ 1.1కి పడిపోయింది.
ఈ వార్తలు సోషల్ మీడియా, నేషనల్ మీడియాలో చర్చనీయాంశం కావడంతో ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమించింది. బీజేపీ వెనక్కు తగ్గి పేజీలో రేటింగ్ ఆప్షన్ను డిజేబుల్ చెయ్యడంతో ఇది యువత విజయం అనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీజేపీకి రానున్న రోజులలో గడ్డు పరిస్థితి ఎదురు కాబోతుంది సోషల్ మీడియాలో.