Andhra-Pradesh-First-EODB-Rankingsఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇసుమంత కూడా సహకరించడం లేదన్న విషయం బహిరంగమే. అయినప్పటికీ కేంద్రానికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తోన్న జగన్ – పవన్ ల ద్వయానికి మరోసారి షాక్ ఇచ్చే విధంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలో టాప్ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది.

98.42 శాతంతో దేశంలోనే నెంబర్ 1గా ఏపీ నిలువగా, ఆ వెనుకే 0.09 పాయింట్లు వెనుకబడి 98.33 శాతంతో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా నిలిచింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి నిలవడం తెలుగు వారిగా సంతోషించదగ్గ అంశం కాగా, అన్నీ వనరులు ఉన్న తెలంగాణాను మించి, ఏపీని టాప్ లో నిలపడం వెనుక చంద్రబాబు ‘బ్రాండ్ నేమ్’ పనిచేస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రాష్ట్రంలో అవినీతి జరిగిపోతోందంటూ గుండెలు బాదుకుంటున్న జగన్ అండ్ పవన్ లు, మరి ఈ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో టాప్ స్థానంలో నిలవడంపై ఎలా స్పందిస్తారో చూడాలి. బహుశా ఇది కూడా అక్రమంగా నెంబర్ 1 స్థానంలో నిలిచారని అంటారేమో?! అయితే ఈ నివేదికను ఇచ్చేది జగన్ – పవన్ లు ఎంతగానో విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వమే!