Andhra-Pradesh-Congress-ఇప్పటివరకు కాంగ్రెస్ తెలుగు దేశం మధ్య పొత్తు ఉండబోతుందని, దాని ద్వారా తమ భవిష్యత్తుకు ఎంతోకొంత గారంటీ అనుకున్న కొందరు నాయకులు ఇప్పుడు ఆశలు వదిలేసుకునట్టుగా కనిపిస్తుంది. ఇటువంటి పుకార్లు షికారు చేస్తున్నా ఇరుపార్టీ నేతలు విమర్శలు ఆపకపోవడంతో ఇది జరిగే పని కాదని వారికి అర్ధం అయిపోయింది.

దానితో మిగిలిన కాస్తో కూస్తో నాయకులు టీడీపీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నారు. కొంచెం పరపతి ఉన్న నాయకులు తమకు గానీ తమ వారసులకు గానీ సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మిగిలిన వారు కనీసం ఏమైనా నామినేటెడ్ పోస్టులు వచ్చినా చాలని సర్దుకు పోతున్నారు. దీనితో అమరావతికి వారి తాకిడి ఎక్కువ అవుతుంది.

ఇటీవలే జనసేనలోకి వెళ్తారని భావించిన దాడి వీరభద్ర రావు కూడా టీడీపీ నాయకత్వంతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. విశాఖపట్నంకు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి చేరడం లాంఛనమే అట. మాజీ మంత్రి శైలజానాథ్ కూడా టీడీపీలోకి రావడానికి ఉత్సాహపడుతున్నట్టు సమాచారం. మొత్తానికి టీడీపీకి ఎన్నికల కళ వచ్చేసిందని చెప్పుకోవాలి.