Jagan Mohan Reddy in AP Assemblyఓ వైపు వరద నీటిలో ప్రజలు ఆర్తనాదాలు ఆలపిస్తుంటే… మరోవైపు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిపై భజన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

హరిదాసుల కీర్తనల మాదిరి ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో జగన్ పాలన, లాలనాలపై గేయాన్ని ఆలపించడం… దానికి వైసీపీ నేతలు చప్పట్లు కొడుతూ అభివాదాలు పలకడం… చంద్రబాబు నాయుడు చేస్తోన్న విమర్శలకు మరింత ఊతమిస్తోంది. ఒక్క నిముషం పాటు ‘ఇది అసెంబ్లీయేనా’ అనిపించేలా చేసారనేది నెటిజన్ల మాట కూడా!

ఇందులో విశేషం ఏమిటంటే… తనపై పాడిన పాటకు గానూ స్వయంగా ముఖ్యమంత్రి గారే మంత్రముగ్ధుడయ్యారు. అంతేనా… ఏకంగా బెంచ్ పై శబ్దం చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. చూడబోతుంటే… ప్రతిపక్షాలు లేని ఈ అసెంబ్లీ సమావేశాలు భజన కార్యక్రమాలులాగా మారిపోయాయని వాపోతున్నారు.