AP-Assembly-Meetingsటంగ్ స్లిప్ అయ్యి మాట్లాడుతున్నారో లేక నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారో తెలియడం లేదు గానీ, అధికారం అందుకున్న నాటి నుండి వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు ఎప్పడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నాయి. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ దానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని, అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రజా ప్రయోజనాలకు వినియోగించేలా చూడాలని మంత్రి గారిని ఓ వైసీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేసారు. అందుకు మంత్రి గారు ఇచ్చిన సమాధానం మాత్రం ‘మైండ్ బ్లాక్’ చేసేసింది. అందుకే ఈ వీడియో అంత వైరల్ అవుతోంది.

“అధ్యక్షా… గౌరవ సభ్యులు అడిగింది నిజమే… అయితే అది చేస్తోంది ఎవరో కూడా కాదు, మనమే! ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఆక్రమణలు చేసి మళ్ళీ మనమే ప్రశ్నలు వేస్తున్నాం” అంటూ మంత్రి గారు ఇచ్చిన రిప్లైకు నెటిజన్లు మిమ్స్ జోడించి మరి సందడి చేస్తున్నారు.

“చేసేది చెప్తాం, చెప్పకుండా చాలా చేస్తాం” అంటూ వైసీపీ చేసిన ప్రచారం వెనుక మర్మం ఇదేనేమో?! అంటూ ఛలోక్తులు విసరడం నెటిజన్ల వంతు!