ఇటీవలే ఆంధ్రజ్యోతి లగడపాటికి చెందిన ఆర్జీ ఫ్లాష్ టీం నిర్వహించిన తెలుగు దేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే ఎల్లో మీడియాలో వచ్చిన ఎన్నికల సర్వే మొత్తం బోగస్ అని కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. సాక్షాత్తు సర్వే నిర్వహించిన వారితో మాట్లాడామని, వాళ్లు చెప్పింది ఒకటని… కానీ ఎల్లో మీడియా మరొకటి చూపించిందని విమర్శించారు.
ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే ఆ సంస్థ బయటకొచ్చి ఖండించకుండా ఉంటుందా? వారి పేరు చెడగొడుతుంటే వారు చూస్తూ ఎందుకు ఉంటారు? మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగి నమస్కారం చేయడం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
హోదా గురించి దేశంలో ఎక్కడా ప్రస్తావించొద్దని చంద్రబాబుకు బీజేపీ పెద్దలు హెచ్చరించారని, ఆ సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. సమాచారం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెడితే కాంగ్రెస్ కు కూడా ఆంధ్రప్రదేశ్ లో మైలేజ్ పెరుగుతుంది. అన్నట్టు ఆ సర్వేలో కాంగ్రెస్ కు మరోసారి సున్నా సీట్లు వస్తాయని చెప్పారు.