జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా కొన్ని రోజులు క్రితం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ముహూర్తం జరుపుకుంది.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈరోజు మొదలయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో అనసూయ కీలకమైన పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. ఆమె దగ్గర దగ్గర ముప్పై నిముషాల పాటు సినిమాలు కనిపిస్తుందంట.
పైగా ఒక పాట కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. రంగస్థలంలోని రంగమత్త పాత్ర తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారట. మొఘలాయిల కాలానికి సంబంధించిన కథ ఇది. మహమ్మదీయుల పరిపాలనా కాలం, అప్పటి పరిస్థితులు… ఇవన్నీ తెరపై చూపించబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు సినిమాలతో రెండు ప్లాపులు ఇచ్చిన క్రిష్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.