Amaravati-Capital-Andhra-Pradesh-Pawan-Kalyanరెండేళ్ళకు పైగా కెమెరాకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘పింక్’ రీమేక్. హిందీలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , తాప్సీ పన్ను నటించిన చిత్రం ‘పింక్’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు సికింద్రాబాద్ దగ్గరలోని ఆల్వాల్. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని సున్నితమైన పరిస్థితుల వల్ల ఈ విషయం బయటకు పొక్కనివ్వడం లేదట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పింక్’ సినిమాను రీమేక్ చేసేందుకు తెలుగు నేటివిటీకీ తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

నివేదా థామస్, అంజలి, అనన్య.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీ ‘పింక్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఈ సినిమాతో థమన్ మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తున్నారు.

ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ.