Amar-Akbar-Anthony-Premieresవరుస పరాజయాల తర్వాత రవితేజ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన “అమర్ అక్బర్ అంటోనీ” సినిమా మరికొద్ది గంటల్లో యుఎస్ ప్రీమియర్ షో పడనుంది. శ్రీను వైట్ల గత సినిమాల ప్రభావం… అలాగే ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ రెగ్యులర్ గా ఉండడంతో… ఇప్పటివరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. ఈ ప్రభావం ఓపెనింగ్స్ పైన స్పష్టంగా కనపడుతోంది.

అంచనాలు వేసిన దాని కంటే అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా ఉండడం స్పష్టంగా కనపడుతోంది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ ‘మౌత్ టాక్’ పైనే ఆధారపడి ఉన్నాయని తేలిపోయింది. ఫస్ట్ షో టాక్ యుఎస్ ప్రీమియర్స్ ద్వారా వెలువడనుండడంతో, చిత్ర యూనిట్ చూపులన్నీ ‘ప్రీమియర్ టాక్’ వైపునే ఉన్నాయి. ఈ సినిమాకున్న మరో ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ హౌస్.

ఈ నెలలో విడుదలైన ‘సవ్యసాచి’ మినహాయిస్తే… ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్స్ ను అందించిన సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ కు ప్రేక్షకులలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో, ‘అమర్ అక్బర్ అంటోనీ’ రిజల్ట్ చిత్ర నిర్మాణ సంస్థకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అందరి కంటే ఎక్కువ ఒత్తిడి అంతా శ్రీను వైట్ల పైనే ఉంది. మరి ఈ చిత్రంలో వైట్ల బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో మరికొద్ది గంటల్లో తేలనుంది.